Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట దామరగిద్ద గ్రామస్థుల ధర్నా
నవతెలంగాణ-చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్దలో జమీందారుల ఆధీనంలోని అదనపు భూములను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంచాలని బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీలింగ్ యాక్ట్1973 ప్రకారం అదనంగా భూములు ఉన్న జమీందారులు, భూస్వాములు ప్రభుత్వానికి ఇవ్వకుండానే అనుభవిస్తున్నారని రెవెన్యూ డివిజనల్ అధికారి వేణుమాధవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, అంబేద్కర్ సంఘం నాయకులు, రైతులు మాట్లాడుతూ.. దామరగిద్దలో ఎన్నో ఏండ్లుగా జమీందార్లకు, భూస్వాములకు ఎన్నో ఎకరాల అదనపు భూములు ఉన్నాయని తెలిపారు. జమీందారులైన మిట్ట విజయ సింహారెడ్డి, మిట్ట యుగంధర్ రెడ్డి వారి తండ్రి కాలం నుంచి వందల ఎకరాల భూములను అక్రమంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కన్నుగప్పి తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ అధికారులకు సైతం జమీందారులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, వారికే పత్రాలు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల తహసీల్దార్ షర్మిల విజయసింహారెడ్డి కుటుంబీకులకు అనుకూలంగా రిపోర్టులు తయారు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు.