Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునిగిన పంటలు
- లోయర్, మిడ్ మానేరు గేట్లు ఎత్త్తివేత
నవతెలంగాణ - విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో వాగులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల గేట్లుఎత్తి కిందకు నింటికి వదులుతు న్నారు. దాంతో వాగులుపొంగి పంటనష్టం వాటి ల్లింది. మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రాష్ట్రం లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో అత్యధికంగా 184.04మి.మీ వర్షపాతం నమోదయిందని అధికారులు చెబుతున్నారు. ఎగువనున్న ఛత్తీస్గఢ్లో ఉరుములు మెరుపుతో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు, వర్రెల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి అర్ధరాత్రి వేళ ఉగ్రరూ పంతో ప్రవహించాయి. మండలంలోని సీతవాగు, చిన్నగుబ్బలమంగి వాగు, కొంగవాగు, పార్కెల వాగు, తూరుబాక పెద్ద వాగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవహించడంతో వరి, పత్తి చేలు వందల ఎకరాల్లో కొట్టుకుపోవడంతో పాటు పలుచోట్ల మేట లు పోశాయి. చాలా చోట్ల రహదారులు కోతలకు గురయ్యాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి పెరగడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలో సుమారు 200 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. మద్నూర్ మండలంలో నాలుగిండ్లు కూలిపోయాయి. గోదావరి, మంజీరా నదులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్లో పోచారం ప్రాజెక్టు, జుక్కల్లోని కౌలాస్నాళా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది.
సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో గ్రావిటీ కెనాల్కు గండిపడి 100ఎకరాల పత్తి పంట నీటి మునిగింది. తంగళ్లపల్లి మండల కేంద్రం రాంనగర్ చివరి ప్రాంతంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇండ్ల్లల్లోకి వర్షపునీరు చేరింది. సనుగుల ఎర్రచెరువు, పటేల్ చెరువు ఫీడర్ ఛానెల్కు గండిపడగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వేములవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడంతో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. పలు గ్రామాలుకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో సుమారు 500ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. పిడుగుపాటుకు తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మల్లేశంకు చెందిన 34 గొర్రెలు, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెళ్లకు చెందిన యాళ్ల రాజిరెడ్డికి చెందిన పాడి గేదె మృత్యువాత పడింది. జగిత్యాల పట్టణంలోని 7,8 వార్డుల్లోని 500ల పూరిగుడిసెల్లోకి వరద నీరు చేరింది. జగిత్యాల రూరల్ మండలం గుళ్లపేటవద్ద వంతెనపై వదర ఉధృతికి రాకపోకలు నిలిచాయి.
లోయర్, మిడ్ మానేరు ఆరు గేట్ల ఎత్తివేత
లోయర్ మానేరు జలాశయం 20గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. దిగువనున్న కాకతీయ కాలువకు రెండు వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ మిడ్ మానేరు ఆరు గేట్లను ఎత్తి 15వేల క్యూసెక్కులను వదలడంతో ఎల్ఎండీకి ఇన్ఫ్లో మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.