Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలలకు నిధులు విడుదల చేయాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాలలకు నిధులు విడుదల చేయాలని ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. శాసనమండలిలో మంగళవారం చైర్మెన్ గుత్తాసుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయ న మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఉపాధ్యా యులే వారి జీతాల నుంచి వర్క్ షీట్లు ఇవ్వాల్సి వస్తున్న దన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి టీవీల ద్వారా పాఠాలు చెప్పే కార్యక్రమం మొదలు పెట్టినందుకు ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అయితే తాము కోరినట్టు ఇంకా ముందు నుంచే ఇది ప్రారంభమై ఉంటే మరింత ప్రయోజనం చేకూరి ఉండేదన్నారు. కేరళ రాష్ట్రం తర్వాత తెలంగాణాయే ఆన్ లైన్ పాఠాలకు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు జూన్ ఒకటి నుంచే పాఠాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. టీశాట్ ఒక ఎయిర్ టెల్ ద్వారా మాత్రమే వస్తున్నదనీ, మిగిలిన డీటీహెచ్ల ద్వారా వచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అడ్మిషన్లు ఇంకా ప్రారంభం కాలేదని చెప్పడం సరికాదనీ, మొదలైనప్పటికీ తరగతి గదుల్లో బోధన ప్రారంభం కాలేదని చెప్పాలనగా మంత్రి అంగీకారం తెలిపారు.