Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు ఆగాల్సిందే..
- అధికఫీజులు వసూలుచేస్తే కఠిన చర్యలు : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్కూళ్లు ఎప్పుడు తెరుస్తామనే దానిపై స్పష్టత రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వస్తేకానీ పాఠశాలలు తెరిచేవిషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. అయితే విద్యాశాఖ తరపున మూడు రకాల సర్వే చేశామని చెప్పారు. రాష్ట్రంలో 85శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉందని సర్వేలో తేలిందన్నారు. 40శాతం విద్యార్థుల ఇండ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయ న్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని పక్కవారితో అనుసంధానం చేశామని తెలిపారు. దూరదర్శన్, టీశాట్ యాప్లో డిజిటల్ క్లాసులు అందుబా టులో ఉంచామన్నారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వర్క్ షీట్లు తయా రు చేశామని చెప్పారు. విద్యార్థులందరూ ఆన్లైన్ క్లాసులు వింటున్నా రని మంత్రి తెలిపారు. 48వేల వాట్సాప్గ్రూపులు ఏర్పాటు చేసి ఆన్ లైన్ బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసి రెడ్డి నారాయణరెడ్డి అడిగినప్రశ్నకు మంత్రి సమాధానామిచ్చారు. ప్రయివేటు స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.