Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే క్రిస్టియన్ భవన్ నిర్మాణం
- క్రైస్తవ మత పెద్దల సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాను పుట్టింది మిషనరీ ఆస్పత్రిలోనేనని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు చెప్పారు. ఎక్కువ కాలం మిషనరీ పాఠశాలల్లోనే చదువుకున్నానని ఆయన తెలిపారు. హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన క్రిస్టియన్ భవన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీనిచ్చారు. నగరంలోని మంత్రుల నివాస సముదాయాల వద్దగల క్లబ్ హౌజ్లో శుక్రవారం కేటీఆర్... క్రైస్తవ మత పెద్దలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యా, వైద్య రంగాల్లో మిషనరీలు ఎనలేని కృషి చేస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలోనూ అవి ప్రజలకు గొప్ప సేవలందించాయని చెప్పారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.