Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎద్దులబండి, కాలినడకన వెళ్ళి ప్రాజెక్టు సందర్శన :భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్
నవతెలంగాణ-కాటారం
తెగిపోయిన శివ శంకర్ ప్రాజెక్ట్ కట్టను వెంటనే తాత్కాలికంగా నిర్మించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఇరిగేషన్శాఖ అధికారులను ఆదేశించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లా కాటారం మండలం వీరాపూర్ గ్రామంలోని శివశంకర్ ప్రాజెక్టు చెరువు కట్ట తెగిపోయి పంట పొలాలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్ స్వయంగా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాజెక్టు వద్దకు వాహనాలు వెళ్లేందుకు అనుకూలించకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్లకుపైగా ఎడ్లబండిలో ప్రయాణించి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం, ఆయకట్టు సాగు వివరాలను ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక వర్షాలతో తెగిపోయిన ప్రాజెక్టు కట్ట దాదాపు 60 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని, పంటనష్ట వివరాలను త్వరగా సేకరించాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణను ఆదేశించారు. తెగిన ప్రాజెక్ట్ కట్టకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి నీరు వధాకాకుండా చూడాలని, శాశ్వత పద్ధతిన కట్టను పూర్తిగా ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఇంజినీర్ సత్య రాజచంద్రకు సూచించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ ఆలయంలో జాతర జరుపుకునేందుకు వీలుగా ఆలయం వరకు రోడ్డు నిర్మించడంతోపాటు ఆలయాభివృద్ధికి హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు, గ్రామంలో డ్రయినేజీ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమి లేనందున భూమి దానం చేసేందుకు గ్రామస్థులు ముందుకొస్తే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, పల్లె ప్రకతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల అభివృద్ధి, అంగన్వాడీ భవన నిర్మాణం చేపడతామన్నారు. అటవీ స్థలంలో శ్మశానవాటికల నిర్మాణానికి ఆ శాఖ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.
జాదూరావుపేట్-వీరాపూర్ లింక్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, సర్పంచ్ రమేష్రెడ్డి కలెక్టర్కు కతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ వెంట ఎస్ఐ సాంబమూర్తి, ఎంపీడీవో శంకర్, పంచాయతీ అధికారి మల్లికార్జున్రెడ్డి, మహాముత్తారం డిప్యూటీ తహసీల్దార్ వినరుసాగర్ ఉన్నారు.