Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరామ్కు మద్దతు ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు నవంబరులో నోటిఫికేషన్ రానుంది. ఈ విషయమై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, , న్యూడెమోక్రసీ పార్టీల కార్యాలయాలకు లేఖలు రాసింది. లేఖల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరామ్కు మద్దతునివ్వాలని టీజెఎస్ కోరింది. టీజేఎస్ను విద్యావంతులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల్లోని పట్టభద్రులు ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.