Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త సచివాలయం ప్రాంగణంలో మసీదు, మందిరం, చర్చీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటనపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం కమిషన్ చైర్మెన్ మహ్మద్ ఖమృద్దిన్ ఆధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చేసిన ప్రకటనపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మసీదు, మందిరం పునర్నిర్మాణంతో పాటు చర్చికూడా నిర్మిస్తామని చెప్పడం సంతోషకరమని అన్నారు. కమిషన్కు ప్రత్యేక కార్యాలయం విషయం ప్రిన్సిపల్ సెక్రటరీ(జీఏడీ) పరిశీలనలో ఉందనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అలాగే వైస్చైర్మెన్, కమిషన్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ అంశం కూడా మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి పరిశీలనలో ఉందన్నారు. కమిషన్ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో కమిషన్ వైస్ చైర్మెన్ శంకర్ లూకె, సభ్యులు గుస్తినోరియా, మహ్మద్ అర్షద్ అలీఖాన్, డా. విద్యాస్రవంతి, ఎంఎ. అజీమ్, బి.కట్టయ్య, సర్ధార్ సురేందర్సింగ్, కార్యదర్శి హరీశ్చందర్ సాహు తదితరులు పాల్గొన్నారు