Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ 2020-21 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ శుక్రవారం సర్క్యులర్ జారీచేశారు. ఆన్లైన్ బోధనపై ప్రధానోపాధ్యాయలు ప్రతీరోజూ పర్యవేక్షించాలనీ, బోధన, బోధనేతర సిబ్బంది 21 నుంచి 50శాతం మంది రోస్టర్ పద్దతిలో విధిగా హజరు కావాలని ఆదేశించారు. అయితే కంటైన్మెం ట్ జోన్లకు ఈఉత్తర్వులు వర్తించవన్నారు. విద్యాసంబంధిత విషయా లు, విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపు లను కొనసాగించాలనీ, సెస్టెంబర్ 21నుంచి వర్క్ఫ్రమ్ హౌమ్ నేపథ్యంలో ఇంటివద్ద ఉన్న సిబ్బందిసైతం విద్యార్థులతో ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూప్ల ద్వారా ఇంటరాక్ట్ కావాలని సూచించారు.