Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ బహిరంగసభలో సాయిబాబు డిమాండ్
- 21, 22లలో మండల కేంద్రాల్లో నిరాహారదీక్షలు
- 28,29,30 తేదీల్లో పనులు బంద్ : జయలక్ష్మి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 28వేల మంది ఆశా వర్కర్లకు వారికి రూ 10వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. కరోనా సమయఇన్సెంటివ్ రూ 5వేలు ఇవ్వాలని కోరింది. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21, 22 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరహారదీక్షలు చేయాలనీ, 28,29,30 తేదీల్లో సమ్మె చేయాలని పిలుపునిచ్చింది. శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జయలక్ష్మి అధ్యక్షతన ఆన్లైన్ బహిరంగసభ జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడుతూ ఆశా వర్కర్లు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఆశావర్కర్లకు ఆరునెలల నుంచి జీతాలు లేకుండా ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఆశావర్కర్ల సేవలతోనే ఆస్పత్రుల్లో కాన్పులు జరుగుతున్నాయన్నారు. సామాజిక శ్రేయస్సు కోసం పని చేస్తున్నా ఆశా వర్కర్ల శ్రేయస్సు పట్టించుకోవడం లేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కరోనా పరీక్షలు చేయాలని కోరడం సరైందికాదన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత, రాష్ట్ర నాయకులు సి లలిత, రాజమణి, కొండ లక్ష్మి, నీలాదేవి, సావిత్రి, మీనా, వాణి, హేమలత, జయప్రద, సంగీత, పి యాదమ్మ మాట్లాడారు.