Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రె మేకల పెంపకందార్ల సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెల, మేకల పెంపకందార్ల సమస్యలను పరిష్కరించాలని జీఎంపీఎస్ డిమాండ్ చేసింది. ఈ నెల 21న ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. శుక్రకారం సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రావుల జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిల్లె గోపాల్, రాష్ట్ర సలహాదారులు కాసాని ఐలయ్య, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.