Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.