Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
కరోనా వైరస్ పోరులో ముందుండి పనిచేస్తున్న డాక్టర్లు, పోలీసులు, అధికారులు అనేకమంది వైరస్ సోకి మరణించారు. మాదాపూర్ పోలీస్స్టేషన్ క్రైమ్ బ్రాంచ్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అబ్బాస్ అలీ (57) కరోనాతో శుక్రవారం మృతిచెందారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బొంపల్లికి చెందిన అబ్బాస్ ప్రస్తుతం బోరబండలో నివాసం ఉంటున్నారు. 1984 నుంచి కానిస్టేబుల్గా పలు పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన పది నెలల కిందట అంబర్పేటలోని క్రైమ్ విభాగంలో శిక్షణ తీసుకొని మాదాపూర్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల కిందట కరోనా బారినపడటంతో ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. విధినిర్వహణలో చలాకీగా ఉంటూ అందరితో సన్నిహితంగా ఉండే వ్యక్తి మృతిచెందడంతో సహ ఉద్యోగులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.