Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డంపింగ్ యార్డు నిర్మాణం అడ్డగింత
- ఆ భూమి తనదేనంటూ వాగ్వివాదం
- చంపుతానంటూ బెదిరించడంతో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి జిల్లా ఇల్లందు టీఆర్ఎస్ ఎంఎల్ఏ హరిప్రియ తండ్రి బాదావత్ సీతారాములు వీరంగం సృష్టించాడు. డంపింగ్యార్డు నిర్మిస్తున్న ప్రభుత్వ భూమి తనదేనంటూ శుక్రవారం అడ్డుకున్నాడు. స్థానిక సర్పంచ్ను చంపుతానంటూ బెదిరించాడు. మనస్తాపానికి గురైన సర్పంచ్ ఉరేసుకునేందుకు ప్రయత్నించగా వార్డు సభ్యులు అడ్డుకున్నారు. చివ రకు సీతారాములపై స్థానిక
పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ఏర్పాటుకు పూనుకుంది. ఈక్రమంలో చుంచుపల్లి మండలం బాబుక్యాంపు పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డు కోసం ప్రభుత్వ భూమిని గుర్తించారు. నిర్మాణానికి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. భూమి పూజచేసేందుకు జెడ్పీ వైస్చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీ పీ బాదావత్శాంతి, స్థానిక సీపీఐసర్పంచ్ బాబురావు, ఎంపీటీసీలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ తండ్రి సీతారాములు అక్కడికి చేరుకుని కార్య క్రమాన్ని అడ్డుకున్నాడు. సర్పంచ్ని తిడుతూ చంపుతానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన సర్పంచ్ సమీపంలోని చెట్టుకు ఉరేసుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన వార్డు సభ్యులు అయనను వారించారు. అనంతరం చుంచుపల్లి పోలీసులకు సీతారాములపై సర్పంచ్ ఫిర్యాదు చేశాడు.