Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర గణాంకశాఖ మంత్రికి బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంపీ ల్యాడ్స్కు సంబంధించి గత టర్మ్ బకాయిల చెల్లింపులకు నిధుల్లేవంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం శోచనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.. రూ.150 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రావు ఇందర్జిత్ సింగ్కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. ఏడాదిన్నర నుంచి నిధుల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. లోక్సభ సభ్యులకు సంబంధించి రూ.95 కోట్లు, రాజ్యసభ సభ్యులకు చెందిన రూ.55 కోట్లను విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేయటం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపట్ల మోడీ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శమని ఆయన లేఖలో పేర్కొన్నారు.