Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో డిప్యూటీ తహిసీల్దార్లకు ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు వారి సీనియార్టీ జాబితాను ఇప్పటికే రూపొందించినట్టు తెలిసింది. ఐదో జోన్లో 152 మంది, ఆరోజోన్లో 186 మంది ఉండగా వీరి వార్షిక నివేదికలను సైతం ఇప్పటికే సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరినట్టు సమాచారం. రిమార్కులతోపాటు ఇతర క్రమశిక్షణా చర్యలున్న వారి వివరాలను ప్రత్యేకంగా పంపాలని కలెక్టర్లకు సర్కారు సూచించింది. సీనియార్టీ జాబితాపై మూడురోజుల్లో అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకే ఉద్యోగోన్న తులుకల్పిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.