Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ చేనేత సంఘాల ముఖ్య నాయకులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయినా, కేవలం వరంగల్ కార్పెట్నును మాత్రమే కొనుగోలు చేయడానికి అక్కడ జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలే కారణమని చెప్పారు. ప్రభుత్వానికి నేతన్నలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో పేరుకు పోయిన రూ. 300 కోట్ల చేనేత వస్త్రాలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.