Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
జేఈఈ-మెయిన్ 2020 బీఆర్క్, బీ ప్లానింగ్ ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1,1,5 వంటి టాప్ 10 ర్యాంకులతో రాణించారు. హార్తిక్ పటేల్ (హాల్ టికెట్ నెం.01330526) బీఆర్క్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఒకటో ర్యాంకు కైవసం చేసుకోగా, కుమార్ సత్యం ( 03106372) బీఆర్ ప్లానింగ్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఒకటో ర్యాంకు సాధించారు. అలాగే బీఆర్క్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు సాధించారు. అలాగే 1,1,5,16,45,80,81 వంటి 100లోపు ఏడు ఓపెన్ కేటగిరీ ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో 1000లోపు 72 ర్యాంకులను నిలిచారు. మరోసారి నారాయణకు నారాయణే సాటి నిరూపించినట్టు సంస్థ నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ, డైరెక్టర్ పి.శరణి నారాయణ పేర్కొన్నారు.