Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన కోటి రూపాయలకు పైగా లంచం కేసులో అదనపు కలెక్టర్తో సహా మరి నలుగురు నిందితుల విచారణను సోమవారం నుంచి ఏసీబీ చేపట్టనుంది. దీనికి సంబంధించి విచారణలో జాయింట్ డైరెక్టర్ మొదలుకుని పలువురు సీనియర్ ఏసీబీ అధికారులు నిందితులను విచారించనున్నారని తెలిసింది. ఈనెల 21 నుంచి ఐదు రోజుల పాటు మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, ల్యాండ్ రికార్డుల విభాగం జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్, మధ్యవర్తి జీవన్గౌడ్లను విచారించడానికి ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు దర్యాప్తు అధికారులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్లో మెదక్ జిల్లా మాజీ కలెక్టరు ధర్మారెడ్డి పాత్ర ఉందని, ఆయన పేరును ప్రాథమిక విచారణలో అదనపు కలెక్టర్ నగేష్ (ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు) తీసుకోవడంతో ఆ దిశగా కూడా ఏసీబీ దర్యాప్తును సాగిస్తున్నది. అరెస్టు చేసిన ఈ ఐదుగురు నిందితుల రిమాండ్ రిపోర్టులో ధర్మారెడ్డి పేరును కూడా ఏసీబీ అధికారులు ప్రస్తావించారు. ఒక వేళ విచారణలో ధరా్మరడ్డి పాత్ర గురించి ఆధారాలు లభిస్తే ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారు అనే ఆసక్తి అధికార వర్గాలలో నెలకొంది.-