Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేణా తగ్గడం ప్రారంభమైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబాకు తెలిపారు. టెస్టుల సంఖ్య పెంచామనీ, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో నెగటివ్ రిజల్ట్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. శనివారం రాజీవ్గౌబా 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కోవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్కుమార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న నియంత్రణ చర్యల్ని వివరించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో కూడా టెస్టులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.