Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పాట్నా హైకోర్ట్లో నెట్ఫ్లిక్స్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ప్రసారం చేస్తున్న 'బ్యాడ్బాయ్ బిలియనీర్స్-ఇండియా' డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తమ సంస్థ లోగోలను యథాతధంగా వినియోగించారనీ, దీనివల్ల తమ సంస్థ ప్రతిష్ట, ప్రయోజనాలు దెబ్బతింటాయనీ, అందువల్ల ఈ డాక్యుమెంటరీని నిలుపుదల చేయాలని కోరుతూ సహారా కంపెనీ బీహార్లోని ఆరారియా సివిల్ కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. దీన్నిసవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ సంస్థ చేసిన అప్పీల్ను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. సివిల్ కోర్ట్ ఉత్తర్వులు యథాతధంగా అమల్లో ఉంటాయని పేర్కొంది. నెట్ఫ్లిక్స్ సంస్థతో పాటు సదరు డాక్యుమెంటరీ దర్శకుడు, ఎగ్జిక్యూటివ్స్పై సహారా కంపెనీ పలు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు ఆ సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ హెడ్ గులాం జీషన్ శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు.