Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులపై ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఆధారాలు ఉన్నాయని ఉన్నతాధికారులు భావించినప్పుడు లేదా ఫిర్యాదుపై దర్యాప్తు చేసే క్రమంలో ఆ ఉద్యోగులను సస్పెండ్ చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేయకుండా ఉండే క్రమంలో ఈ విధంగా చర్యతీసుకునే అవకాశం చట్టంలోనే వెసులుబాటు ఉందని వివరించింది. క్రిమినల్ కేసు లేదా శాఖాపరమైన విచారణకు సంబంధించిన అంశాలపై ఆరోపణలు గతంలోని వైనా, తాజా ఫిర్యాదు ఆధారంగా కూడా విచారించవచ్చని కూడా స్పష్టం చేసింది. సస్పెండ్ చేయడమనేనది శిక్ష కాదనీ, కేవలం ప్రభుత్వం , ఉద్యోగి మధ్య ఒక చర్య మాత్రమేనని వివరించింది. 14 ఏండ్ల నాటి వ్యవహారాలపై రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొంటూ జగిత్యాల డిప్యూటీ తహసీల్దార్ నరసింహచారి హైకోర్టును ఆశ్రయించారు. తొలుత సింగిల్ జడ్జి ఆయన వ్యాజ్యాన్ని కొట్టేయడంతో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని ధర్మాసనం కొట్టేస్తూ పైవిధంగా తీర్పు చెప్పింది. ఫిర్యాదుపై విచారణ లేదా దర్యాప్తు జరిగేప్పుడు సస్పెండ్ చేయవచ్చనీ, ఇలా చేయడం శిక్ష విధించినట్టు కాదని తీర్పులో హైకోర్టు పేర్కొంది.