Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్తీ సమయంలో 20 శాతం వెయిటేజీ మార్కులు.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఊరట లభించే తీరులో హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఆ క్యాటగిరీ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ చేసేట ప్పుడు 20శాతం వరకూ వెయిటేజీ మార్కులు ఇవ్వొచ్చునని తేల్చింది. ఈ విధంగా చేసేందుకు ప్రభుత్వం అంగీకరించి చేస్తే అమలుకు వీలుంటుందనీ, వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ లేదా హక్కు వారికి లేదని వివరించింది. వెయిటేజ్ మార్కులు 20శాతానికి మించ కూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూ ర్తులు జస్టిస్ రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావు త్రిసభ్య ధర్మాసనం తీర్పుచెప్పింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల్లో కాం ట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల్లో చేసే ఉద్యోగులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని, ఇవ్వరాదని పరస్పర విరుద్ధంగా దాఖ లైన కేసుల్లో ఇద్దరు జడ్జీల రెండు డివిజన్ బెంచ్లు 2014, 2017ల్లో వేర్వేరు తీర్పులు చెప్పడంతో ముగ్గురు జడ్జీల బెం చ్ విచారణచేసి తీర్పుచెప్పింది. సబార్డినేట్ రూల్స్1996 లోని 31ని సడలించి కాంట్రాక్ట్ సర్వీసుల్లో వారికి వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే అధికారం గవర్నర్కు ఉందని తేల్చింది. ఒక్క పిటిషనర్ కూడా సర్వీస్ రూల్స్ను ప్రశ్నించలేదని, అందుకే వాటిపై న్యాయ సమీక్ష చేయలేదని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ల్లో కేసులు వేసుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది. ట్రాన్స్కో, జెన్కోల్లో చేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్టాఫ్కు వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేసి పలు వ్యాజ్యా ల్లో వెయిటేజీ గరిష్టంగా 20మార్కులుగా ఉండాలని 2014 లో డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే వ్యవసాయ శాఖలో వెయిటేజీ మార్కుల పద్ధతికి స్వస్తి చెప్పడాన్ని సవాల్ చేసిన అదే తరహా కేసులో ఇంకో డివిజన్ బెంచ్.. వెయిటేజీ ఇవ్వరాదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదిస్తూ 2017లో తీర్పు చెప్పింది. రెండు పరస్పర విరుద్ధమైన తీర్పులు వెలు వడిన నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం 86 పేజీల ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ల్లో లైన్మెన్,జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజి నీర్స్ తదితర పోస్టుల భర్తీకి కాంట్రాక్టు సిబ్బందికి 6నెలల సర్వీస్కు 2.5మార్కులు చొప్పున గరిష్టం గా 45 మార్కుల్ని వెయిటేజీగా ఇవ్వాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. దీనిని సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి సంవత్సరానికి 2 మార్కుల చొప్పున 20మార్కులే గరిష్టంగా ఉండాలని చెప్పారు. దీనిపై అప్పీల్ చేస్తే డివిజన్ బెంచ్ ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 వెయిటేజ్ మార్కులు ఇవ్వా లంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోస్టుల భర్తీకి రాతపరీ క్షలు నిర్వహించుకోవచ్చునని ఓపెన్ క్యాటగిరీ అభ్యర్థుల కేసులో హైకోర్టు చెప్పింది. ఇదే సమయంలో వ్యవసాయ శాఖలో సమైక్య ఏపీలో అమల్లో ఉన్న వెయిటేజ్ మార్కుల పద్ధతికి తెలంగాణ రాష్ట్రం రద్దు చేయడాన్ని ఇంకో డివిజన్ బెంచ్ 1017లో ఆమోదించింది.