Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి
- గిరిజన సంక్షేమశాఖ మంత్రికి టీఎస్యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్ళి పాఠాలు చెప్పాలని ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి శనివారం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో కరోనా విజంభిస్తున్న సమయంలో ఉపాద్యాయులు బయటి నుంచి ఆయా విద్యార్థుల గ్రామాల్లోకి వెళ్ళి పాఠాలు బోధించడం సాద్యం కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అత్యుత్సాహంతో సర్కులర్ జారీ చేసి ఉపాధ్యాయులు, పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి పాఠాలు బోధించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.