Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2123 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 1,69,169 మంది వైరస్ బారిన పడగా, అందులో 1,37,508 మంది కోలుకున్నారు. 30,636 మంది చికిత్స పొందుతున్నారు. మరో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా వారి సంఖ్య 1025కు చేరింది.1207 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా 54,459 మందిని పరీక్షించగా అందులో 3.89 శాతం మందిలో వైరస్ బయటపడింది. ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 65,570 మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు.
ఐదు జిల్లాల్లో వందకుపైగా...
రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 305 ఉన్నాయి. రంగారెడ్డి 185, మేడ్చల్ - మల్కాజిగిరి 149, నల్లగొండ 135, కరీంనగర్ 112, కేసులొచ్చాయి. అతి తక్కువగా కొమురంభీం ఆసీఫాబాద్ 16, నారాయణపేట్ 18, ఆదిలాబాద్ జిల్లాలో 19 కేసులను గుర్తించారు.