Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హదరాబాద్
హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కె.తారకరామారావుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం మరో పది అంబులెన్స్లను అందజేశారు. కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వీటిని సమకూర్చారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,. ఎంపీ రంజిత్రెడ్డి ఒక అంబులెన్స్ చొప్పున, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కె. ప్రభాకర్రెడ్డి రెండు అంబులెన్స్లను ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మహేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అంబులెన్స్లను ఇచ్చినవారిలో ఉన్నారు. గత నెల 8న కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్లను ఇచ్చిన సంగతి తెలిసిందే. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎస్. సైదిరెడ్డి, ఎంపీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి 9 అంబులెన్స్లను అందజేసినవారిలో ఉన్నారు.