Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-మిర్యాలగూడ
మరో నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో మానసిక క్షోభ అనుభవించిన నిరుద్యోగి సెల్ఫీ వీడియో తీసుకున్నాక ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫీ వీడియో శనివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సంపత్కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం యువకుడు మిర్యాలగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆ వీడియోలో.. 'కేసీఆర్ నేనుండలేను. గ్రూప్-2 నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో.. ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 20 రోజులుగా ఆలోచించి.. ఆలోచించి తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నా.. నా చావుతోనైనా కేసీఆర్ సారు స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయండి.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. స్నేహితులందరినీ వదిలిపెట్టి వెళుతున్నందుకు బాధగా ఉంది. చదివి.. చదివి మైండ్ పాడైపోతుంది.. ప్రయివేటు ఉద్యోగం చేయలేకపోతున్నా.. వీఆర్వోలను తీసేశారు.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి.. కొత్త ఉద్యోగాలు రావడం లేదు' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతోంది. కానీ, పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులకు సైతం సమాచారం లేదు.
ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలి : కేసీఆర్కు విజయశాంతి ప్రశ్న
'కేసీఆర్గారూ...మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో చెప్పండి' అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ విజయశాంతి ప్రశ్నించారు. సికింద్రాబాద్లో వర్షాలకు పొంగిపొర్లిన దీనదయాళ్నగర్ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏండ్ల విద్యార్థిని జీవితం కరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.