Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న చేపట్టే ఆందోళనకు సీపీఐ(ఎం) మద్దతు : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా పార్లమెంట్లో నిత్యావసర సరుకుల సవరణ చట్టం, వ్యవసాయోత్పత్తుల వాణిజ్య వ్యాపార చట్టం, ఒప్పంద సాగు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంను ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదిం ప చేసుకోవడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం ఖండించారు. ఇవి చట్టరూపం దాలిస్తే ఇప్పటికే సమ స్యల్లో ఉన్న రైతాంగం మరింత సంక్షోభంలోకి వెళతారన్నారు. తద్వారా రైతుల ఆత్మ హత్యలు కూడా అధికమవు తాయని వ్యాఖ్యానించారు. రైతులను ఉరితీసేలా ఉన్న ఈచట్టాలను అమల్లోకి తేకుం డా తక్షణమే ఉపసంహరిం చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈనెల 25న రైతుసం ఘాలు చేపడుతున్న దేశవ్యాప్త నిరసనల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార చట్టంలో కార్పోరేట్ సంస్థలకు లాభం కలిగేలా మార్కెట్ చట్ట సవరణలు చేసి కొనుగోలు దారులకు స్వేచ్ఛ కల్పించడం సరి కాదన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్పై ఉన్న నియంత్రణను తొలగించారనీ, రైతులు ఎక్కడైనా తమ సరుకును అమ్ముకో వచ్చంటూ, దాని వల్ల రైతులకు లాభాలు వస్తాయని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ రైతులు తమ ముడి ఉత్పత్తులనే అమ్ముకోవడం అలవాటుగా ఉందన్నారు. మధ్య దళారీలు కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి అత్యధిక లాభాలు గడిస్తున్నారని వివరించారు. ఈ స్వేచ్ఛా మార్కెట్తో రానున్న కాలంలో కనీస మద్దతు ధరల విధానం లేకుండా పోతుందని చెప్పారు. ఇప్పటికే ప్రతియేటా సగటున 12,000 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ఈ చట్టాల అమలుతో ఈ సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదముందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను రక్షించడం కన్నా, కార్పోరేట్ సంస్థల పరిరక్షణకే సహాయకారిగా ఉంటున్నదనేది ఈ బిల్లును పరిశీలిస్తే అర్థమవుతున్నదన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని పరోక్షంగా అమలు జరుపుతూ పేదల భూములన్ని ఆక్రమిస్తున్నారనీ, ప్రస్తుత చట్టం ద్వారా మరింత స్వేచ్ఛతో పేదల భూములన్ని కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి అవకాశమేర్పడుతుందన్నారు. ''నిత్యావసర సరుకుల సవరణ చట్టం''తో పప్పులు, ఉల్లి, ఆలుగడ్డ, పసుపు, మిరప తదితర ఆహార ధాన్యాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఇప్పటివరకు ఉండడంతో ధరలు అదుపులో ఉన్నాయన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఆహారధాన్యాల ధరలకు రెక్కలు వచ్చి కార్పొరేట్లు అత్యధిక లాభాలు పోగేసుకుంటారనీ, ఈ చట్టాల ద్వారా భారత వ్యవసాయరంగం పూర్తిగా కార్పోరేటీకరణవైపు మళ్లుతుందన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకొని మార్కెట్లపై ప్రభుత్వ నియంత్రణతో పాటు కనీస మద్దతు ధరల విధానం రూపొందించాలని సీపీఊ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.