Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'కరోనా కష్టాల్లో మత్స్యకారులు, ఆదుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు' అనే అంశంపై 22న ఆన్లైన్ బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, అరుణోదయ విమలక్క, ఎంసీపీఐ తాండ్రకుమార్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత కె గోవర్ధన్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్, తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకుసుధాకర్ తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు.