Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి వెంకట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 25న దేశ వ్యాపిత నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసనలో బాగంగా రాస్తారోకో, రైల్రోకోలతో పాటు ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పంటలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లకు స్వేచ్చ ఇవ్వడం, బడా కంపెనీలకు కాంట్రాక్ట్ వ్యవసాయం కట్టబెట్టడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలపై పరిమితి రద్దు చేసే మూడు చట్టాల వల్ల వ్యవసాయ రంగం కార్పొరేట్ల చేతుల్లోకి పోతుందని విమర్శించారు.
నేడు, రేపు బిల్లు కాపీల దగ్ధం : తెలంగాణ రైతు సంఘం పిలుపు
వ్యవసాయ బిల్లును అప్రజాస్వామికంగా రాజ్యసభ ఆమోదించడాన్ని నిరసించాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. నేడు, రేపు (21,22 తేదీల్లో) బిల్లు కాపీలను దగ్ధం చేయాలనీ, 25న రాష్ట్రవ్యాప్తింగా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ పిలుపునిచ్చారు.