Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ - నాగార్జున సాగర్/మహబూబ్నగర్/ మెండోరా
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. నాగార్జునసాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,07,970 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో డ్యామ్ అధికారులు 14 క్రస్టు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 589.20 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,597 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8640, ఎడమ కాలువ ద్వారా 2818, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు మొత్తంగా 2,50,749 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు 2,01,306 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఇది 210.9966 టీఎంసీలకు సమానం. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,59,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 18గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 48,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదేస్థాయిలో 1,55,641 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.615 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.029 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1,42,523 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. దాంతో 25 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు డీఈ జగదీష్రెడ్డి తెలిపారు. అయితే 20,650 క్యూసెక్కుల నీటితో ప్రాజెక్టును నింపుతూ, 1,21,874 క్యూసెక్కుల మిగులు జాలాలను బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090.10 అడుగులకు చేరుకుంది.