Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి తలసాని
నవతెలంగాణ-కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'మేము ఎక్కడికి పారిపోలేదు. పనికిరాని వ్యక్తుల గురించి నేను మాట్లాడను. అయినా ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి తీసుకెళ్లిన చరిత్ర మాదే. లక్షల ఇండ్లు ఒకేచోట కట్టరు. అవి ఎక్కడెక్కడ కట్టామో లెక్కలు ఇస్తాము. ఇప్పటికైనా భట్టి విక్రమార్క అభివృద్ధిపై రాజకీయం మానుకోవాలి' అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్కు చేరుకున్న ఆయన స్థానిక మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష ఇండ్లు ఒకేచోట కడతారా? అని భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. తాను ముందు నడుస్తుంటే వెనకాల ఏవో తిట్టుకుంటూ పిచ్చి కామెంట్లు చేయడం వల్లనే వదిలేసి వచ్చామన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజరు అనవసర విషయాల మీద రాద్ధాంతం చేయడం తప్ప తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. దమ్ముంటే మోడీతో కొట్లాడి నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేయాలనీ హితవు పలికారు. సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ విజయ, నగర మేయర్ సునీల్రావు పాల్గొన్నారు.