Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి చంద్రన్నను అరెస్ట్ చేయడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై పనిచేస్తున్న వారిని అరెస్టులు, నిర్బంధాల ద్వారా అణిచి వేయాలని పూనుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించింది. చంద్రన్నకు ప్రాణ హాని తలపెట్టకుండా తక్షణమే కోర్టులో హాజరుపర్చి విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదనీ, నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించింది. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించడం సరి కాదని అభిప్రాయపదింది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, పౌర హక్కులు కాపాడాలని కోరుతున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.