Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 86.5 మిల్లీమీటర్ల వర్షపాతం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి ప్రభావం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రంహెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలా బాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు
పడొచ్చు. ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఇది రాగల 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో మరింత బలపడే అవకాశం ఉంది. ఆదివారం నాడు నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మినహా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో సగటున 9.8 మిల్లీమీటర్ల వాన పడింది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో అత్యధికంగా 86.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్లో 84.5 మిల్లీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 81.2 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.