Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్ఫీ ద్వారా కలెక్టర్కు బాలుడు ఆవేదన
నవతెలంగాణ -వలిగొండ
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట లు నీటమునిగాయి. నష్టంఅంచనాకు అధికారు లు పర్యటనలు చేస్తున్నారు. నష్టపరిహారం ఎంతమందికి అందుతుందో, అసలు అందు తుందో లేదో కూడా తెలియదు. దీనిపై ఓ బాలుడు సోషల్మీడియాలో పోస్ట్చేసిన వీడియో హల్చల్ చేస్తోంది. 'తమ ఆరెకరాల పంట నీటమునిగిందనీ, నష్టపరిహారం ఇవ్వకున్నా సరే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా చూడాలనీ' కలెక్టర్ను ఈ వీడియో ద్వారా కోరాడు. ఈ సంఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జరిగింది. అరూరుకి చెందిన దోతి ఐలయ్య, చంద్రమ్మ దంపతులు తమకున్న ఆరెకరాల్లో వరి సాగు చేసుకుంటున్నారు. నెల రోజుల్లో పంట చేతికొస్తుందగా.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు భారీగా వచ్చి ఆరెకరాల పంటంతా నీట మునిగింది. ఇది చూసిన దంపతుల మనువడు వరుణ్ నీట మునిగిన పొలంలో కూర్చొని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వరద నీరు బయటికి పోయేందుకు సమీపంలో తూము ఉందని, కానీ దాని సామర్ధ్యం చిన్నగా ఉండడంతో మొత్తం నీళ్లు బయటికి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని వీడియోలో వివరించాడు. తమకు పంటకు నష్ట పరిహారం ఇవ్వకున్నా పర్వాలేదు కానీ భవిష్యత్లో ఇలాంటి నష్టం జరగకుండా చూడాలని, తూము సామర్థ్యాన్ని పెంచాలని కలెక్టర్ను వేడుకున్నాడు.