Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి : మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్
- 25న చలో హైదరాబాద్
- 21, 22లలో నిరసనలు, కలెక్టర్లకు వినతులు : జె.వెంకటేశ్, కృష్ణారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీఆర్సీ ప్రకటన కోసం, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కోసం ఉద్యోగులంతా సంఘటితంగా పోరాడాలనీ, అప్పుడే ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ఈ పోరాటాన్ని కనీసం 2 కోట్ల మంది ప్రజల్లో విస్కృతంగా తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభను ఆదివారం నిర్వహించారు. ఫెడరేషన్ అధ్యక్షులు జె.వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు భయపడేది ప్రజలకేననీ, ప్రజల అసంతృప్తి వెల్లువెత్తితే ఎక్కడ వారి ఓట్లు దూరమవుతాయో అన్న భయంతో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తాయనీ, దానికీ ఎల్ఆర్ఎస్ చార్జీల తగ్గింపు, ఆర్టీసీ ఉద్యోగుల పోరాటాలే సాక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులు చేసే పనులన్నింటినీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో చేయించుకుంటూ వారికి సరైన జీతాలివ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడు తున్నదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ముదనష్టపు విధానం ఉండనివ్వబోమనీ, ఆ ఉద్యోగులందరినీ పర్మినెం ట్ చేస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. లాకౌ డౌన్ కాలంలో ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఉద్యోగుల వేతనాల కు కోతపెట్టి తన బాధ్యతను మరిచిందని విమర్శించారు. అమెరికా, యూరప్ దేశాలలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే గంటలు, డైలీవేజ్, కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు అధిక వేతనాలుం టాయనీ, మనదగ్గరనేమో కనీసం ప్రభుత్వ పేస్కేలును కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్, కృష్ణారెడ్డి మాట్లాడుతూ 25న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 21,22 తేదీలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ జిల్లా కేం ద్రాల్లో నిరసనలు తెలిపి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. 23, 24 తేదీల్లో చలోహైదరాబాద్ జయప్రదం కోసం ప్రచారం చేయాల న్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ నేత పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ వెట్టిచాకిరీ విముక్తి నుంచి బయపటపడేందుకు అన్ని శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యం కావాల న్నారు. సర్వశిక్షా అభియాన్ జేఏసీ నేత ఎమ్.సురేంద్ర మాట్లాడుతూ ఒకే జీవో ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియమితులైన తమకు ప్రస్తు తం ఏపీలో రూ.24,300 వేతనం ఇస్తుండగా, తెలంగాణలో రూ.12 వేల నుంచి 15 వేలు మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేశ్ మాట్లాడుతూ ఆయా శాఖల్లో విడివిడిగా పీలికలుగా ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక బలమైన తాడుగా మారి ప్రభుత్వ మెడకు చుట్టుకున్న ప్పుడే సీఎం కేసీఆర్ దిగివచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. యూని వర్సిటీల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రొఫెసర్ల జేఏసీ నేత రామేశ్వర్ మాట్లాడుతూ కడియం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తమ కు వేతనాలు పెంచుతామనీ, ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, నాయకులు పద్మ, జగదీశ్, జి.సైదులు, కుమారస్వామి, రమేశ్, బ్రహ్మచారి, రవీందర్, సంతోశ్, తదితరులు మాట్లాడారు.