Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 1,72,608 మందికి పాజిటివ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా నిర్ధారిత పరీక్షల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆదివారం నాటికి మొత్తం 25,19,315 మందికి టెస్టులు చేయగా వారిలో 1,72,608 (6.85 శాతం) మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ప్రతి 10లక్షల మందిలో 67,858 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. 1,41,930 మంది ఈ వ్యాధి నుంచి బయటపడగా 29,636 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 31,095 మందికి కోవిడ్-19 టెస్టు చేయగా వారిలో 1302 మందికి (4.18 శాతం) పాజిటివ్ వచ్చింది. 1205 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరొ తొమ్మిది ప్రాణాలొదలగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1042కు చేరింది.
రెండు జిల్లాల్లో వందకుపైగా......
రాష్ట్రంలో రెండు జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 266, కరీంనగర్ జిల్లాలో 102 ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు లేదు. అతి తక్కువగా నిర్మల్ జిల్లాలో నాలుగు, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎనిమిది చొప్పున కేసులొచ్చాయి.