Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంచార జీవనం సాగిస్తున్న 17 కులాలకు గుర్తింపు ఇస్తూ బీసీ జాబితాలో చేర్చడం పట్ల ఆ కులాల ఐక్యవేధిక హర్షం వ్యక్తం చేసింది. బీసీ జాబితాలో చేరేందుకు కృషి చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ను ఐక్యవేదిక నాయకులు మంగళవారం హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గీశాడి గడియ లోహ కులానికి 70 ఏండ్ల తరువాత మొట్ట మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని మంత్రి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా కులసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రిజర్వేషన్లు లేకుండా ఎన్నో బాధలు పడ్డామనీ, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి, విద్యా, ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.