Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ను రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీబీఎస్ఈ సూచనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, రెండవ సంవత్సరంలో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీ సబ్జెక్ట్ల్లో 30 శాతం, తగ్గించినట్టు తెలిపారు. తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల పాటు తరగతులు నిర్వహించలేకపోయామనీ, సీబీఎస్ఈ సూచన మేరకు ఏర్పాటు చేసిన సబ్జెక్ కమిటీల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. తగ్గించిన సిలబస్ వివరాల కోసం టీఎస్బీఐఈ అధికారిక వెబ్సైట్ ్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ సందర్శించవచ్చని తెలిపారు.