Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర బిల్లులకూ గవర్నర్ ఆమోదం
- గెజిట్ నోటిఫికేషన్ల విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టం రూపం దాల్చాయి. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. కీలకమైన రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో భూహక్కులు - పాసు పుస్తకాలు, వీఆర్వోలరద్దు, టీఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్, ప్రయివేటు వర్సిటీలు, తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు, తెలం గాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు, తెలంగాణ సివి ల్ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయ శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. దీంతో ఈ బిల్లులన్నీ చట్టం రూపంలో అమల్లోకి వచ్చాయి.