Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావును హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవ అంబాసిడర్ గా దక్షిణ భారత దేశం నుంచి నియమించినట్టు ఆ సంస్థ తరఫున రవీంద్ర కుమార్ న్యూ ఢిల్లీలో ప్రకటించారు. కోటేశ్వరరావు మీడియా రంగంలోనే కాకుండా,పలు సామాజిక కార్యక్రమాలను చేస్తున్నందుకు గత సంవత్సరం గ్లోబల్ పీస్ ఫౌండేషన్ వారు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు సంస్థకు ,సహాయ సహకారాలు అందించిన మీడియా ,మిత్రులకు కోటేశ్వరరావు ధన్య వాదాలు తెలిపారు.