Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే సంస్కరణలు:సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతులను కూలీలుగా మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల మార్పులు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సొంత పొలంలో పంటలు సాగు చేసుకుంటున్న రైతులు భవిష్యత్లో కూలీలుగా మారే అవకాశముందన్నారు. పంట కొనుగోలు చేసే కార్పొరేట్, ప్రయివేటు వ్యక్తులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగ బిల్లు ఆమోదంపై ప్రధానమంత్రి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బిల్లు అమలుపై అన్ని రైతు సంఘాలు, అనేక పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయని, ఈ నెల 25న రైతులు చేపట్టే పోరాటానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు.