Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా సమయంలో అవి మాకెంతో ఊరట : ఆర్థిక మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి
- ఆన్లైన్లో మంత్రులబృందం సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమీకృత వస్తు సేవల పన్ను (ఐజీఎస్టీ) కింద తెలంగాణకు రావాల్సిన రూ.2,641 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు... కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో ఈ డబ్బును విడుదల చేస్తే అదిరాష్ట్రానికి ఎంతో ఊరటనిస్తుందని ఆయన తెలి పారు. అక్టోబరు ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావే శానికి ముందే ఐజీఎస్టీ చెల్లింపుల కోసం సిఫారసు చేయాలని కోరారు. ఐజీఎస్టీపై కేంద్రం నియమించిన మంత్రుల బృంద (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశాన్ని మంగళవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈ భేటీకి ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షత వహించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న హరీశ్రావు మాట్లాడుతూ... తెలంగాణకు ఐజీఎస్టీ కింద రూ.2,638 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ జీఎస్టీ కౌన్సిల్ లెక్కలేసిందని గుర్తు చేశారు. ఈ ప్రకారంగా చూస్తే రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాంట్లో రూ. మూడు కోట్లను తగ్గించారని తెలిపారు. ఈ అంశాన్ని రాష్ట్ర అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. అయితే ఐజీఎస్టీకి సంబంధించిన మొత్తా లను వారం రోజుల్లోగా చెల్లించే విధంగా సిఫారసు చేయాలంటూ సుశీల్ కుమార్ను కోరారు.
రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలపై వచ్చే నెల ఐదో తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలనీ, లేకపోతే మరో మూణ్నెల్లు ఆగాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఐజీఎస్టీ నిధులు రాష్ట్రాలకు వెంటనే అందేలా సిఫారసు చేయాలని కోరారు. 18రాష్ట్రాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపెన్సే షన్ నిధులను, ఆయా రాష్ట్రాలకు భవిష్యత్తులో చెల్లించే పరిహారాల మొత్తంలోంచి సర్దుబాటు చేయాలని సూచించారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి వసూలు చేయాల్సిన రూ.1,015కోట్లను భవిష్యత్తులో చెల్లింపులసమయంలో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి సర్దుబాటు చేయాల ని కోరారు. మంత్రి విజ్ఞప్తిపై సుశీల్ కుమార్ సానుకూలంగా స్పందిం చారు. అక్టోబరు ఒకటిన తిరిగి ఐజీఎస్టీ మంత్రుల బృంద సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 2018 నుంచి తెలంగాణతో పాటు మరో 16రాష్ట్రాలకు కలిపి 25,058కోట్ల ఐజీఎస్టీ నిధులు రావాల్సి ఉందని వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామ కృష్ణారావు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్తో పాటు ఆయా శాఖలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.