Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలను వేగంగా నమోదు చేయండి : సీఎం కేసీఆర్ ఆదేశం
- ధరణి పోర్టల్పై అధికారులతో సమీక్ష
- 15 రోజుల గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదుకాని ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచా యతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఈ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయా లని సూచించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా రూపొందిస్తున్న ధరణి పోర్టల్పై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు నర్సింగరావు, స్మితా సభర్వాల్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మున్సి పల్, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం డీపీవోలు, ఎంపీవోలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. అధికారులు ఆన్లైన్లో నమోదు చేసేందుకు వీలుగా ప్రజలు తమఆస్తుల వివరాలను సమర్పించాలని కోరారు. భూరికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారద ర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్కు శ్రీకారం చుడు తున్నామని ఆయన తెలిపారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటంతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పా టు, ప్రతీ ఇంటికి ఆరు మొక్కలను ఇవ్వటం, హరితహారం, పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్లు, గ్రామాల నుంచి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి వీలుగా ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
రిజర్వాయర్కు అటవీ భూమి..
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చటానికి వీలుగా మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా కేశవాపురం వద్ద నిర్మిసు ్తన్న పది టీఎమ్సీల రిజర్వాయర్కు అవసరమైన 409.53 హెక్టార్ల అటవీ భూమికి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతి లభించింది. ఈమేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్ర అటవీశాఖకు అనుమతి లేఖ అందింది.