Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్బన్ ఫారెస్ట్ పార్కులు: మంత్రి అల్లోల
- ఆరు నుంచి 'జూ' ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శనివారం నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగర పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి సందర్శకులకు సానిటైజర్లను అందుబాటులో ఉంచాలనీ, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే అక్టోబర్ 6 (జూ డే) నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి సందర్శకులను అనుమతించనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ఉన్న చోట నీటిని తొలగించి, పార్కును పూర్తిగా శుభ్రపరచాలని జూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.