Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్ధుల కోసం ప్రసారం చేస్తున్న డిజిటల్ బోధనలపై శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో శైలేశ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ శనివారం టీ-సాట్ నిపుణ ఛానల్లో ప్రారంభమయ్యే ఫోన్ ఇన్ లైవ్లో సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుల బందం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు గంటల పాటు జరిగే ప్రత్యేక ఫోన్ ఇన్లో 11 గంటల నుంచి 11.30గటల వరకు మ్యాధమెటిక్స్ 11.30 నుంచి 12 గంటల వరకు ఫిజిక్స్, 12 నుంచి 12.30గంటల వరకు బయోసైన్స్, 12.30 నుంచి ఒంటి గంట వరకు సోషల్ స్టడీస్కు సంబంధించిన సందేహాలను విద్యార్ధులు నివత్తి చేసుకునేందుకు వీలుగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్ధులు ప్రతి శనివారం టీ-సాట్ స్టూడియోలో అందుబాటులో ఉండే మూడు ఉపాధ్యాయ బందాల ద్వారా సబ్జెక్టుల వారీగా ఉత్పన్నమయ్యే అనుమానాలను నివత్తి చేసుకోవచ్చని సూచించారు. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం వారాంతంలోని రెండవ శనివారం, ప్రభుత్వ సెలవులు మినహా అన్ని శనివారాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీఈవో ప్రకటించారు. టీ-సాట్ నిపుణ చానల్తో పాటు టీ-సాట్ యూట్యూబ్లోనూ లైవ్ అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్ధులు 040-23540326, 18004254039 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్చేసి సబ్జెక్టులకు సంబంధించిన అనుమానాలను నివత్తి చేసుకోవచ్చని తెలిపారు.