Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ అన్లైన్ రెండవ విడత అడ్మీషన్ల దరఖాస్తు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ మేరకు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 27 వరకు ఆవకాశం కల్పించామన్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26లోగా అన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ప్రయివేటు కాలేజీల్లో దోస్త్ అడ్మీషన్లలో తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం అన్లైన్ సమావేశం నిర్వహించినట్టు వివరించారు. దరఖాస్తులో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం దోస్త్ హెల్ప్ లైన్ 040 - 66662262 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
టీఎస్ పీఈసీఈటీ గడువు పెంపు
తెలంగాణ ఫిజికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ మేరకు టీఎస్సీహెచ్ఈ చైర్మెన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హల్ టికెట్లను అభ్యర్థులు అక్టోబర్ 10 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా పరీక్షను అక్టోబర్ 19 న్విహిస్తున్నట్టు వివరించారు.