Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఅండ్పీ డైరెక్టర్గా బి.వీరారెడ్డి
- ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డైరెక్టర్గా డి.సత్యనారాయణరావు
నవతెలంగాణ-జైపూర్
సింగరేణిలో ఏర్పడిన రెండు డైరెక్టర్ ఖాళీలను శుక్రవారం భర్తీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ పూర్తి చేసినట్టు సింగరేణి భవన్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)గా బి.వీరారెడ్డి, డైరెక్టర్(ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్)గా డి.సత్యనారాయణ నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ అధ్యక్షతన కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపిక కమిటీ సభ్యుల్లో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్, కోలిండియా సీఎంపీడీఐ సీఅండ్ఎండీ శేఖర్ సరన్, కేంద్రబొగ్గు శాఖ సెక్రటరీ పీఎస్ఎల్ స్వామి ఉన్నారు. డైరెక్టర్(పీఅండ్పీ)గా ఎంపికైన వీరారెడ్డి ఇంతకు ముందు ఆడ్రియాల లాంగ్వాల్ జనరల్ మేనేజర్గా పని చేశారు. డైరెక్టర్ (ఈఅండ్ఎం)గా ఎంపికైన సత్యనారాయణరావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్ మేనేజర్ (ఈఅండ్ఎం)గా ఉన్నారు. డైరెక్టర్ (పీఅండ్పీ) స్థానానికి సీనియర్ జనరల్ మేనేజర్లు ఐదుగురు హాజరు కాగా, డైరెక్టర్ (ఈఅండ్ఎం) స్థానానికి సీనియర్ జనరల్ మేనేజర్లు నలుగురు హాజరైనట్టు ప్రకటనలో పేర్కొన్నారు.