Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచశాంతి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరానికి చెందిన రచయిత, టెస్కాబ్ విశ్రాంత అసిసెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ టి.అశోక చక్రవర్తి కవితకు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే రేడియోలో 'ప్రపంచశాంతి ప్రాయోజిత కార్యక్రమం' కింద ఆయన రాసిన కవితను ప్రసారం చేశారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన ప్రతియేటా సెప్టెంబరు 21న ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంగ్లంలో రాసిన తన కవితను చక్రవర్తి పలు దేశాలకు పంపారు. ఈ నేపథ్యంలో దాన్ని ఉరుగ్వే రేడియో.. స్పానిష్ భాషలోకి అనువదించి ప్రసారం చేసింది. మరోవైపు అనేక మంది ఆంగ్లంలో కవితలను పంపినప్పటికీ చక్రవర్తి కవితకే గుర్తింపు దక్కటం గమనార్హం.