Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే నెల 12న కౌంటింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా కారణంగా వాయిదా పడ్డ నిజామాబాద్ స్థానిక సంస్థల ఉపఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే నెల 12న కౌంటింగ్ చేస్తారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా డాక్టర్ భూపతిరెడ్డి డిసెంబరు 2015లో ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన జనవరి 5, 2016లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ టికెట్పైన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినందుకు టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి మండలి చైర్మెన్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని జనవరి 16, 2019న ఆయనపై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మె ల్సీని ఎన్నుకోనున్నారు. ఈ ఉపఎన్నికకు కల్వకుంట్ల కవిత(టీఆర్ఎస్), సుభాష్రెడ్డి(కాంగ్రెస్) లక్ష్మీనారాయణ(బీజేపీ) నామినేషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో ఇద్దరు అభ్యర్థులు శ్రీనివాస్, భాస్కర్ నామినేషన్లను పరిశీలన సమయంలోనే అధికారులు తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్రావు, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి నామి నేషన్లు ఉపసంహరించుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రధానపార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటం గమనార్హం.